PLD: నూజెండ్ల మండలంలో బుధవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో నరసరావుపేట ఆర్డీఓ మధులత పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను ఆర్డీఓ స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.