GNTR: పట్టాభిపురం పీఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ బృందం బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.76,300 నగదు, 11 సెల్ఫోన్లు, 2 కార్లు, 4 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ఫోన్ పే ద్వారా రూ.2,51,100 ఆన్లైన్ లావాదేవీలను గుర్తించామని పోలీసులు తెలిపారు. మొత్తం లావాదేవీల విలువ రూ.3,27,400కు చేరిందని వెల్లడించారు.