SKLM: కాశీబుగ్గలో ఉన్న శ్రీ సాయి శిరీష డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ యు.సాయికుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శిరీష ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని తెలియజేశారు. సుమారు 600 మంది నిరుద్యోగులకు అవకాశం ఉంటుందన్నారు.