E.G: దేవరపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో HPV టీకాపై ఎంపీపీ కేవీకే దుర్గారావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలో అర్హులైన 524 మంది బాలికలను గుర్తించడం జరిగిందన్నారు. వారికి త్వరలోనే టీకాలు అందజేస్తామని PHC వైద్యాధికారి డి.సంజీవ్ కుమార్ తెలిపారు. స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించే HPV టీకా పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.