VZM: విజయనగరం కలెక్టరేట్లోని సఖి కార్నర్లో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సీడీపీవో ప్రసన్న మాట్లాడుతూ.. UNCRC 2025 నినాదం ప్రకారం పిల్లల్లో హక్కులు, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పించేందుకు సఖి ప్రోగ్రాం రూపొందించబడిందని పేర్కొన్నారు. పిల్లలు మానసిక, శారీరక దృఢత్వంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని తెలిపారు.