ASR: జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతుంది. చింతపల్లిలో ఆదివారం 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. మన్యంలో సాయంత్రం సుమారు 3 గంటల నుండే చలి విజృంభిస్తోంది. రాత్రి సమయంలోనూ అలాగే ఉదయం సుమారు 9.30 గంటల వరకు పొగమంచు కురుస్తోంది.