మార్కాపురం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా, ఆర్డీవో పెంచల ప్రభాకర్ బుధవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలను సమర్థవంతంగా అమలుపరుస్తానని, మార్కాపురం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.