E.G: దేశంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ల కోసమే ప్రవేశపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.