SKLM: గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.