ELR: ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరులో వారు మాట్లాడారు. ఐఆర్ ఇవ్వాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు చేయాలన్నారు.