PPM: శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉంటూ బొత్స సత్యనారాయణ రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం రాష్ట్ర శాసనసభలో ఇటీవల చేసిన తీర్మానం పనికిరాదని బొత్స ప్రకటించడాన్ని భీశెట్టి వ్యతిరేకించారు.