CTR: ఇరుపక్షాలు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ తోడ్పడుతుందని సీనియర్ సివిల్ జడ్జ్ ఆరిఫా షేక్ అన్నారు. పుంగనూరు పట్టణంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీకి ముందుకు వచ్చిన కక్షిదారులను విచారించి వారి ఇరువురి సమ్మతం మేరకు న్యాయమూర్తులు రాజీ చేశారు.