W.G: మొంథా తుఫాన్ ప్రభావంతో నరసాపురం, మొగల్తూరు మండలాలలోని సముద్రంలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం ముందుకు వచ్చిందని స్థానికులు తెలుపుతున్నారు. దీంతో అలలు ఉద్ధృతకు తీర ప్రాంతం గ్రామాలు పీఎం లంక, పేరుపాలెం, కేపీ పాలెం గ్రామాల్లో సముద్రం కోతకు గురయ్యింది. తుఫాన్ నేపథ్యంలో పర్యాటకులను పోలీసులు బీచ్లోకి అనుమతించడం లేదు.