BPT: పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో బస్సులు ఆగక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొనసాగుతోంది. రోడ్డుమార్జిన్లో నిలబడి ఉన్న మహిళలు, చిన్నారులను చూసినా కొన్ని బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.