PLD: చిలకలూరిపేట మండలంలోని 15 పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు. బుధవారం ఓ బంకును ఆయన తనిఖీ చేశారు. వాహనదారులు ఆందోళన చెంది అనవసరంగా ఆయిల్ స్టాక్ చేసుకోవద్దని సూచించారు. వ్యవసాయానికి ఆయిల్ కావాల్సిన రైతులు వీఏవో వద్ద కూపన్ తీసుకుని పొందవచ్చన్నారు.