సత్యసాయి: కదిరిలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద స్వరూపుడైన గరుత్మంతుడిని అధిరోహించిన మోక్ష నరసింహుడిని దర్శించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.