NTR: పల్లెపండుగ 2.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. గొల్లపూడిలో రూ.1.35 కోట్ల అంచనా వ్యయంతో సిమెంటు రహదారుల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతకు పల్లెపండుగ నిదర్శనమన్నారు. మరో వైపు పేదల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.