KRNL: భారత కమ్యూనిస్టు పార్టీ 100వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు, ఎన్నో పోరాటాలు CPI పార్టీకే సాధ్యమైందని సీపీఐ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్న తెలిపారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో కమ్యూనిజంపై ఓ సంచికను ఎమ్మిగనూరు DSP ఉపేంద్రబాబు చేతుల మీద విడుదల చేయడం జరిగిందని రంగన్న తెలిపారు.