కృష్ణా: సీసీ కెమెరాలతో నేరస్తులను పట్టుకోవచ్చని కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ పేర్కొన్నారు. మండవల్లిలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం గ్రామ పెద్దలు, వ్యాపారులతో సీఐ సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 500 మంది ప్రజలకు ఒక పోలీసు ఉంటే కంట్రోలు చేయగలరని, మన వ్యవస్థలో 5 వేల మందికి ఒక పోలీసు లేరని పేర్కొన్నారు.