ప్రకాశం: యువత ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలని జిల్లా సీపీఐ కార్యదర్శి ఎం.ఎల్ నారాయణ అన్నారు. ఒంగోలు నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఏఐవైఎఫ్ 16వ మహాసభలలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.