TPT: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వివిద రైల్వే సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం పార్లమెంట్ జీరో అవర్లో గళమెత్తారు. ఈ సందర్భంగా పలు రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట-గూడూరు మూడవ రైల్వే లైన్ త్వరగా పూర్తి చేయాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు.