GNTR: సీఎం చంద్రబాబు రైతులను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యపై ఈనెల 9న ‘అన్నదాత పోరు’ పేరిట ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గుంటూరులో సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు.