ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం పుస్తక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. కళాశాల గ్రంథాలయ అభివృద్ధి, విద్యార్థుల్లో చదవడం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు లైబ్రేరియన్ మాదల మోహన్ కుమార్ చెప్పారు. పోటీ పరీక్షలకు, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి గ్రంథాలయం తోడ్పడుతుందని ప్రిన్సిపాల్ పి చలపతిరావు తెలిపారు.