శ్రీకాకుళం: నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వద్ద ఉన్న జమియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.