ప్రకాశం: బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి గ్రామంలో ఉన్నటువంటి చేపల చెరువు వేలం పాటను శుక్రవారం చక్రయపాలెం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇంఛార్జ్ రవీంద్ర నిర్వహించారు. ఈ చాపల చెరువు వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనలేదని కావున వేలం పాటను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. త్వరలో మరల ఎప్పుడు వేలంపాట నిర్వహించే విషయాన్ని తెలియపరుస్తామన్నారు.