కృష్ణా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ పట్టణం బంటుమిల్లి మెయిన్ రోడ్డుకు సోమవారం మరమ్మతులు నిర్వహించారు. నిత్యం వేలమంది ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుండడంతో మెయిన్ రోడ్డుకు గుంతలు ఏర్పడి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తమ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే రాము పట్ల స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.