VSP: మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో మంగళవారం వాగులు, వంకలు, కొండలపై నుంచి వరద నీరు గోస్తని నదిలోకి చేరడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనికి తోడు తాటిపూడి జలాశయం నుంచి నీటిని వదలడంతో తదితర ప్రాంతాలలో వరద ఉద్ధృతి పెరిగి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సమీప ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా అధికారులు ఉండాలని కోరారు.