NTR: విజయవాడలో నిరుద్యోగులను మోసం చేస్తున్న స్వర్ణ కుమారి అనే మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మధురా నగర్కు చెందిన ఈమె హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నగదు వసూలు చేసింది. గతంలో కూడా అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.