CTR: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని విచారణ కమిటీ మంగళవారం సందర్శించింది. అపోలో యాజమాన్యం, ప్రభుత్వ వైద్య అధికారులతో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపైన సమీక్ష చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అపోలో యాజమాన్యంతో కుదుర్చుకున్న ఎంవోయూను వివరించారు. ఆస్పత్రిలో అపోలో చేపట్టాల్సిన చర్యలపై జాయింట్ కమిషనర్ రమేష్ నాథ్, డిప్యూటీ కమిషనర్ రమేష్ కిశోర్ సమీక్షిస్తున్నారు.