VZM: కొత్తవలస మండలం దేవాడ గ్రామ పరిధిలో వెలసిన తోటలో దుర్గమ్మ అమ్మవారిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాం ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం జరిగిన చండీహోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించగా ఆలయ కమిటీ పెద్దలు ఎమ్మెల్యేను గౌరవ సత్కారం చేశారు.