E.G: ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం రాజమండ్రిలో జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డిజిటల్ డాక్యుమెంటేషన్పై దిశానిర్దేశం చేశారు. న్యాయస్థానాల్లో సమన్లు, వారెంట్ల అమలులో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమన్నారు.