NLR: రాపూరు గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఐటీడీఏ అధికారిణి కె. సుజాత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం, హాస్టల్ గదులు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర మిషన్ కింద మరుగుదొడ్ల పనులను పర్యవేక్షించి అవసరమైన వసతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.