KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలంతో సమస్య మరింత తీవ్రం అయింది. బోర్లు కూడా సరిపడ నీరు ఇవ్వడం లేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.