NTR: విజయవాడ అర్బన్ ఏరియాలోని కానూరు, పింగళి వెంకయ్య మార్గ్ (పీవీఎం)లోని రెండు వీధుల ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే నెల రోజుల వరకు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. వీధుల్లో నిలిచిపోయిన నీటి కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.