అన్నమయ్య: కలికిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించిన అర్చకులు, పాలు, తేనె, కబ్బరి నీటితో అభిషేకం చేశారు. పుష్పాలంకరణలతో ముస్తాబైన వాహనం భక్తులను ఆకట్టుకుంది. ఉత్సవం సందర్భంగా భక్తులకు దర్శనకాంక్షతో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది.