కృష్ణా: పోరంకిలో శనివారం జరుగుతున్న ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలలో సినీనటి జయప్రద పాల్గొన్నారు. సినీ నటిగా ఉన్న తన రాజకీయ అరంగేట్రానికి కారణం ఎన్టీఆర్ అని, టీడీపీలో సేవకురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించానన్నారు. తెలుగువారంతా ఆరాధించే గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఆయనకు ఇష్టమైన విజయవాడలో జరగడం ఆనందదాయకమన్నారు.