కృష్ణా: స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ ఉంగుటూరు మండలం ఆత్మకూరులో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. యువతరమే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్ అన్నారు. యువత వివిధ రంగాల్లో శిక్షణ పొంది వారి కాళ్లపై వారు నిలబడి దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.