ప్రకాశం: దర్శి మండలం పోతవరంకు చెందిన చెల్లా పోలేరమ్మ తన భూమిని కొందరు ఆక్రమించారని కలెక్టర్ రాజబాబు దగ్గర వాపోయింది. ఈ నెల 10వ తేదీన కలెక్టర్ పల్లెనిద్రకు పోతవరం వెళ్ళారు. ఆ మహిళ తన గోడును కలెక్టర్తో వెళ్లబోసుకుంది. కలెక్టర్ స్థానిక రెవిన్యూ అధికారులను సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. అధికారులు ఆమె పొలంకు హద్దులు ఏర్పాటు చేసి అప్పగించారు.