NLR: పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో 16వ డివిజన్ ఇంఛార్జిగా జయరామిరెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజమైన కార్యకర్తగా జయరామిరెడ్డి సేవలు చేశారని కొనియాడారు.