NDL: ప్రజల సమస్యలపై ఆర్జీలను స్వీకరించి, తక్షణమే పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బనగానపల్లెలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సాగునీటి సంఘాలకు ఎన్నికైన నేతలు పంట కాల్వలను అభివృద్ధి చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.