కోనసీమ: వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అల్లవరానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధను నియమించినట్లు ఆమె గురువారం మీడియాకు తెలిపారు. అనురాధ మాట్లాడుతూ.. ఈ పదవిని బాధ్యతగా తీసుకుని వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.