ATP: రాయదుర్గం పట్టణంలో బస్టాండ్ సమీపాన ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలు శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయ దిశగా ముందుకెళ్దాం అని సూచించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.