KMM: గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. గురువారం జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సంధర్భంగా సత్తుపల్లిలోని మెయిన్ రోడ్లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని చెప్పారు.