PPM: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొమ్మాలి భాను, ఎంపీడీవో మురళీధర్ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, జూనియర్ అసిస్టెంట్ కిషోర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.