CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,అర్చకులు, గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.