బనగానపల్లె మండలం కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ క్షేత్రమైన శ్రీ నందవరం చౌడేశ్వరి మాతకు చతుర్దశి పూజలు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారిని ఆకుపూజ, విశేష పుష్పలాంకరణలో అలంకరించి రుద్రాభిషేకం, అభిషేకం, కుంకుమార్చన, నైవేద్యాలు సమర్పించి మహా మంగలహారతితో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.