పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో బీజేపీ పదాధికారుల జిల్లా సదస్సు శుక్రవారం ఉదయం గమినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సభలో జిల్లా ముఖ్య ప్రముఖులు నరిశే సోమేశ్వర రావు మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యకరమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, ఆర్సెస్ నాయకులు పాల్గొన్నారు.