KRNL: రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కౌలు రైతు సంఘం పట్టణ కార్యదర్శి గోపాల్, సీపీఐ కార్యదర్శి మండల కార్యదర్శి కల్లుబావి రాజు కోరారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కౌలు రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కేటాయించాలన్నారు. రైతు ఆత్మహత్యలలో కౌలు రైతుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేశారు.