VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం న్యూ ఢిల్లి ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన పార్లమెంట్ నిధులలో మొదటి కోటి రూపాయలు విజయనగరం పార్లమెంట్లోని చేనేత రంగ అభివృద్ధి కై ఖర్చు చేయబోతునట్లుగా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు.