AP: ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కోళ్లు మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ల్యాబ్కు పంపాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేదించాలని అన్నారు.